యాప్నగరం

మందలించిందని కొడుకు.. తట్టుకోలేక తల్లి.. మహబూబ్‌నగర్‌లో విషాదం

తెలంగాణ అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లీకొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Samayam Telugu 2 Feb 2020, 10:02 pm
ఖాళీగా ఉంటూ ఆవారాగా తిరగొద్దని.. బుద్ధిగా చదువుకోమని మందలించడంతో మనస్థాపానికి గురై కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నకొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తట్టుకోలేకపోయిన ఆ తల్లి కూడా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ అత్యంత విషాద ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోచోటుచేసుకుంది.
Samayam Telugu suicide 2


నవాబు పేట మండలం కొల్లూరు గ్రామానికి చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. ఖాళీగా ఉంటున్న కొడుకును బుద్ధిగా చదువుకోవాలంటూ మందలించడమే ఆ తల్లి చేసిన నేరమైంది. తల్లి తిట్టిందన్న మనస్థాపంతో కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: వామ్మో!! అది తల్లి కాదు రాక్షసి.. పిల్లలను ఒక్కొక్కరిగా.. షాకైన పోలీసులు

కడుపుకోత భరించలేకపోయిన ఆ తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగేసింది. స్థానికులు గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది తల్లీకొడుకులను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Read Also: భర్తను ప్రేమించిందని.. యువతి బట్టలిప్పేసి.. ఆడాళ్ల అరాచకం

క్షణికావేశంలో కొడుకు.. అది భరించలేక తల్లి ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.