యాప్నగరం

గుంటూరు: కన్నతల్లిపైనే కామంతో రెచ్చిపోయిన కొడుకు.. చివరికి

మద్యానికి డబ్బుల కోసం కొడుకు చిత్రహింసలు పెట్టినా భరించిన ఆ తల్లి తనను చెరబట్టాలని చూసిన కొడుకుని క్షమించలేదు. తాడుతో ఉరేసి చంపేసింది.

Samayam Telugu 28 Jul 2020, 7:03 am
గుంటూరు జిల్లా బాపట్లలో దారుణం జరిగింది. నవమాసాలు కనిపెంచిన కన్నతల్లినే చెరబట్టాలని చూశాడో కామాంధుడు. అతడి వేధింపులకు విసిగిపోయిన ఆ మాతృమూర్తి అపర కాళికైంది. అతని జీవితానికి మరణ శాసనం రాసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన యువకుడికి (30) ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసై, రోజూ హింసిస్తుండటంతో భార్య తన ఇద్దరు బిడ్డలను తీసుకుని నాలుగేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. నాటి నుంచి అతడిని తల్లే పోషిస్తోంది. ఆ దుర్మార్గుడు తాగడానికి డబ్బులివ్వాలంటూ తరుచూ తల్లిని కొట్టేవాడు. ఇటీవల తీవ్రంగా కొట్టడంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.
Samayam Telugu Image


Also Read: ఇంటి అద్దె చెల్లించలేదని... తల్లీకూతుళ్లపై యజమాని అత్యాచారం

అయితే లాక్‌డౌన్ కారణంగా తన బిడ్డ తిండికి ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న ఆ తల్లి తిరిగొచ్చేసింది. సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై మద్యం మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో షాకైన ఆమె వెంటనే తేరుకుని అతడి కళ్లల్లో కారం కొట్టింది. కావిడి తాడును అతని మెడకు బిగించి చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కుమారుడి నుంచి తాను ఎదుర్కొన్న క్షోభను డీఎస్పీ, బాపట్ల రూరల్ సీఐలకు ఏడుస్తూ వివరిస్తున్న ఆమెను చూసి స్థానికులూ కంటతడి పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: కొత్త ప్రియుడి మోజులో పాత ప్రియుడి హత్య.. వీడిన గుంటూరు మర్డర్ మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.