యాప్నగరం

అనుమానంతో వేధించిన భర్త.. కొడుకు గొంతుకోసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవ చివరకు వారి కుమారుడ్ని బలితీసుకున్న దారుణమైన ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Samayam Telugu 23 Apr 2019, 11:29 am
భార్యాభర్తల మధ్య గొడవ చివరకు వారి కుమారుడ్ని బలితీసుకున్న దారుణమైన ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భర్తతో గొడవపడిన ఇల్లాలు తన ఏడాదిన్నర కొడుకు గొంతు కోసి హత్య చేసింది. అనంతర తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌లో నారాయణ రెడ్డి, సుశీల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న నారాయణరెడ్డి తన భార్యతో రోజూ గొడవపడుతుండేవాడు. అతడి వ్యవహారశైలి కారణంగా కుటుంబంలో రోజూ గొడవలు జరగడంతో సుశీల విసుగు చెందింది.
Samayam Telugu crime


తీవ్ర మనస్తాపానికి గురయిన ఆమె మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూరగాయలు కోసే కత్తితో తన కుమారుడి గొంతు కోసి హత్య చేసింది. అనంతరం ఆమె కూడా తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆ బాలుడు మరణించగా, తీవ్రంగా గాయపడిన సుశీలను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల విభేదాలకు అభంశుభం తెలియని చిన్నారి బలవడం చూసి చుట్టుపక్కల వారు కంటతండి పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.