యాప్నగరం

మరిదిపై కోపం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసిన మహిళ

కుటుంబ కలహాలతో కలత చెందిన మహిళ తన ఇద్దరు కూతుళ్లకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి చంపేసింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Samayam Telugu 26 Apr 2020, 10:42 am
నవమాసాలు కనిపెంచిన పిల్లలను కన్నతల్లే విషమిచ్చి చంపేసిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చి జిల్లా కముదిరం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలతో అత్తింట్లోనే ఉంటోంది.
Samayam Telugu suicides


Also Read: పరాయి మహిళతో రాసలీలలు... కేసుల భయంతో వ్యక్తి ఆత్మహత్య

ఈ నెల 19న ఇంట్లో రూ.2 వేలు కనిపించకపోవడంతో గొడవ జరిగింది. ఆమె మరిది అందరినీ అనుమానిస్తూ ఇష్టం వచ్చినట్లు తిట్టి బయటకు వెళ్లిపోయాడు. అయితే మరిది తనపై అనుమానంతోనే తిట్టాడని భావించిన ఆమె ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించింది. బాలికలు నురగలు కక్కుకోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు వారికి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరు బాలికలు శుక్రవారం చనిపోయారు.

Also Read: కన్నతల్లినే చంపేసిన కిరాతకుడు.. కర్నూలు జిల్లాలో దారుణం

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. తన మరది డబ్బుల విషయంలో తనను అవమానిస్తూ మాట్లాడాడని, అతడిపై కోపంతోనే తన బిడ్డకు విషమిచ్చి చంపినట్లు ఆమె విచారణలో చెప్పింది. దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘నువ్వైనా సుఖంగా ఉండు’.. మూడో భార్యకు మెసేజ్‌ పెట్టి యువకుడి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.