యాప్నగరం

కన్నకొడుకుని కొట్టిచంపిన కసాయి తల్లి.. విశాఖలో దారుణం

చేతికందొచ్చిన కొడుకు చేదోడుగా ఉంటాడనుకుంటే తాగుడుకి బానిసయ్యాడు. నిత్యం ఇంటికొచ్చి తనతో సహా కూతురిని కూడా వేధిస్తుండడంతో ఓర్వలేకపోయి దారుణానికి పాల్పడింది.

Samayam Telugu 12 Jul 2020, 1:36 pm
విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొడుకుని కన్నతల్లే అతి కిరాతకంగా హత్య చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం మండలం రామచంద్రనగర్‌కి చెందిన అశోక్ వర్మ తల్లి వరలక్ష్మి, అక్కాబావ శ్రీదేవి, వెంకటేశ్వరరాజుతో కలసి నివసిస్తున్నాడు. రాడ్ వెండర్‌గా పనిచేస్తున్న అశోక్ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి తల్లితో.. అక్కతో గొడపడేవాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
visakha murder


శనివారం ఫుల్లుగా తాగొచ్చిన అశోక్ తన సోదరి శ్రీదేవితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. కొడుకు ప్రవర్తనతో విసుగుచెందిన తల్లి వరలక్ష్మి పక్కనే ఉన్న రోకలిబండతో తలపై కొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో అశోక్ అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కన్నకొడుకుని హత్య చేసిన తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Also Read: పోలీస్ బైక్‌ని ఢీకొట్టిన కారు.. హైదరాబాద్‌లో విషాదంAlso Read: ప్రియుడితో రెచ్చిపోయిన భార్య.. భర్త అడ్డుగా ఉన్నాడని కూతురితో కలసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.