యాప్నగరం

ముగ్గురు పిల్లల తల్లి బంధువుతో కలిసి హోటల్‌‌కి వెళ్లి..

కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు భర్త వద్దకు చేరుకుని విషయం చెప్పింది. దీంతో అతడు భార్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు.

Samayam Telugu 8 Nov 2019, 3:04 pm
రాజస్థాన్‌లో ఓ మహిళపై సమీప బంధువే అత్యాచారానికి పాల్పడ్డాడు. చిత్తోర్‌గఢ్‌లోని పిప్లానీ ప్రాంతంలో ఓ మహిళ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. సెప్టెంబర్ 1న ఆమె మధ్య అత్తమామలను చూసేందుకు భోపాల్ వెళ్లింది. తిరిగి వెళ్లే సమయంలో ఆమెకు సమీప బంధువైన ఓ యువకుడు కనిపించాడు. దీంతో తనను రైల్వేస్టేషన్‌లో దించాలని కోరగా సరేనన్నాడు.
Samayam Telugu mother of 3 children raped by distant relative in rajasthan
ముగ్గురు పిల్లల తల్లి బంధువుతో కలిసి హోటల్‌‌కి వెళ్లి..


Also Read: 12ఏళ్ల బాలికను ప్రియుడు రేప్ చేస్తుంటే వీడియోలు తీసిన ఫ్రెండ్స్

ఆమెను కారులో ఎక్కించుకున్న ఆ వ్యక్తి సమీపంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు సేదదీరి వెళ్దామని చెప్పడంతో సరేనంది. ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అతడు తలుపులు వేసి తన కోరిక తీర్చాలని కోరాడు. మొబైల్ ఫోన్ లాక్కుని, బెదిరించి ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లి సుమారు 10రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు.

Also Read: మహిళను అసభ్యంగా ఫోటో తీసిన యువకుడు.. చితక్కొట్టిన ఆమె భర్త

ఎట్టకేలకు ఈ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు భర్త వద్దకు చేరుకుని విషయం చెప్పింది. దీంతో అతడు భార్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. బంధువే కదా అని నమ్మి వెళ్తే ఇంత దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Also Read: చిత్తూరు జిల్లాలో దారుణం.. పెళ్లిలో చిన్నారిని ఎత్తుకెళ్లి హత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.