యాప్నగరం

స్కూల్‌కి వెళ్లనని కూతురి మారాం.. వాతలు పెట్టిన తల్లి

స్కూల్‌కి వెళ్లనని మారాం చేసిన ఆరేళ్ల కూతురిని వాతలు పెట్టిందో మహిళ. బాలిక నాయనమ్మ ఇంటికి రావడంతో వెలుగుచూసిన ఘటన. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు.

Samayam Telugu 27 Sep 2019, 3:12 pm
పిల్లలు స్కూల్‌కి వెళ్లకపోతే తల్లిదండ్రులు బ్రతిమాలో బుజ్జగించో వాళ్లని దారికి తెస్తారు. ఎక్కువ మారాం చేస్తే ఏదైనా కొనిస్తామని మభ్యపెట్టి స్కూల్‌కి పంపిస్తారు. అయితే ఈ కన్నతల్లి మాత్రం స్కూల్‌కి వెళ్లనని మారాం చేసిన కన్నకూతురి ఇంటి నిండా వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేసింది. చిన్నారి శరీరంపై వాతలు తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu రెియేేన


Also Read: మగాడిపై ఐదుగురి గ్యాంగ్ రేప్.. ముంబయిలో దారుణ ఘటన

కర్నూలు జిల్లా అవుకు మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన ప్రశాంతికి 2007లో ప్రసాద్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి బిందు మాధవి అనే కుమార్తు ఉంది.. తీవ్ర అనారోగ్యంతో ప్రసాద్ 2017లో చనిపోవడంతో ప్రశాంతి ఒంటరిదైంది. దీంతో అవుకు పట్టణంలోని కుమ్మరిదిడ్డి వీధిలో కూతురితో కలిసి ఉంటూ కూలిపనులకు వెళ్తోంది.

Also Read: వేధింపులు తట్టుకోలేక భార్యా భాధితుడి ఆత్మహత్య

మూడో తరగతి చదువుతున్న బింధు మాధవి మూడు రోజుల క్రితం స్కూల్‌కి వెళ్లనని మారాం చేయడంతో తల్లి ఆమె చేతులపై వాతలు పెట్టింది. రెండ్రోజుల నుంచి బయటకు రాకూండా గదిలోనే నిర్బంధించింది. గురువారం వారింటికి వచ్చిన ప్రసాద్ తల్లి లక్ష్మీదేవి బాలిక పరిస్థితి చూసి చలించిపోయింది. స్థానికుల సాయంతో బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశాంతిపై ఫిర్యాదు చేసింది. దీనిపై అవుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఆరేళ్ల కుమార్తెను గొంతు నులిచి చంపేసిన తండ్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.