యాప్నగరం

తల్లీకొడుకుల ఆత్మహత్య.. తూర్పుగోదావరిలో విషాదం

తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 7 Jul 2020, 7:27 pm
తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లీకొడుకులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. కోరుకొండ మండలానికి చెందిన జాగపాటి నవరత్నమ్మ, ఆమె కొడుకు ప్రకాశం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మానసిక ఒత్తిడితోనే తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


హఠాత్తుగా తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటనపై స్పష్టత కొరవడింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరోనా కష్టకాలంలో పలువురు ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిందా? లేక ఆర్థిక సమస్యలా? మరేమైనా కారణాలున్నాయా అనే విషయాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.

Also Read: భర్తకి నిద్రమాత్రలిచ్చి, అక్కడ కరెంట్ పెట్టి దారుణం.. ప్రియుడి మోజులో భార్య ఘాతుకంAlso Read: సహోద్యోగితో లేడీ కానిస్టేబుల్‌ ఆ సంబంధం.! ఎస్పీని ఆశ్రయించిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.