యాప్నగరం

కొడుకు సెల్ఫీ సరదా.. తల్లితో సహా గల్లంతు.. చిత్తూరులో విషాదం

సెల్ఫీ సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ఫీ తీసుకుంటుండగా నీటి ప్రవాహ ఉధృతికి తల్లీకొడుకులు గల్లంతయ్యారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 23 Oct 2020, 5:45 pm
చిత్తూరు జిల్లాలో వరదలో చిక్కుకుని తండ్రీకూతుళ్లు గల్లంతైన ఘటన మరో విషాద ఘటన వెలుగుచూసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నది వద్ద సెల్ఫీ కోసం ప్రయత్నించి తల్లీకొడుకులు గల్లంతైన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పలమనేరు పట్టణానికి చెందిన మౌలా కౌండిన్యా నదిపై జల్లిపేట వద్ద నిర్మించిన చెక్‌ డ్యాం సందర్శనకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
check dam


మౌలా కుమారుడు హమీదుల్లా తన తల్లి పర్వీన్‌తో చెక్‌డ్యాం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. కళ్లముందే తల్లీకొడుకు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి పర్వీన్ మృతదేహాన్ని వెలికితీశారు. కొడుకు హమీదుల్లా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: బస్సు ప్రయాణంలో నిద్రపోయాడంతే.! ప్రకాశంలో షాకింగ్ ఘటన

రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలోని పెనుమురు వద్ద కొండయ్య వాగులో గురువారం రాత్రి తండ్రీకూతుళ్లు గల్లంతయ్యారు. వివాహ కార్యక్రమానికి వెళ్లొస్తున్న కుటుంబం వరదలో చిక్కుకుంది. కూతురు సాయి వీణ వరద నీటిలో కొట్టకుపోవడంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి తండ్రి ప్రతాప్ కూడా నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఈ రోజు ఉదయం కూతురు సాయి వీణ మృతదేహం లభ్యమైంది. ప్రతాప్ కోసం గాలింపు కొనసాగుతోంది.

Read Also:
ఇంజనీర్ ఉద్యోగమని రూ.లక్షల్లో దోపిడీ.. మంగళగిరి మోసగాడి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.