యాప్నగరం

Mumbai: రెచ్చిపోయిన డ్రగ్స్ బానిసలు.. మగాడిపై ఐదుగురి గ్యాంగ్ రేప్

మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో అత్యంత జుగుప్సాకరమైన ఘటన జరిగింది. ఐదుగురు యువకులు 36ఏళ్ల వ్యక్తిని నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 27 Sep 2019, 3:18 pm
దేశంలో మహిళలకే కాదు మగాళ్లకు కూడా రక్షణ లేకుండా పోతోందనడానికి తాజా ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో 36ఏళ్ల వ్యక్తిపై దుండగులు గ్యాంగ్‌రేప్‌కి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సిగరెట్ కావాలని అడిగిన కొందరు వ్యక్తులు అతడిని నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Samayam Telugu man rape


Also Read: హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. భర్తను బంధించి భార్యపై యజమానుల అఘాయిత్యం

నవీ ముంబయిలోని వసీ ప్రాంతంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సాగర్ విహార్ లేక్ వద్ద ఐదుగురు వ్యక్తులు అతడిని ఆపి సిగరెట్ ఉందా? అని అడిగి మాటల్లో దించారు. కొద్ది నిమిషాల్లోనే అతడి నిర్బంధించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. బాధితుడు కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్ వేసి మలద్వారం ద్వారా గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. అక్కడ కొబ్బరిచిప్పను దూర్చి చిత్రహింసలు పెట్టారు. పురుషాంగాన్ని పంటితో కొరికి గాయం చేశారు. అనంతరం బాధితుడిని అక్కడే వదిలేసి పారిపోయారు.

Also Read: కదులుతున్న కారులో మహిళపై 9మంది గ్యాంగ్ రేప్

గురువారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు బాధితుడిని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాధితుడికి సర్జరీ చేసి మలద్వారం నుంచి కొబ్బరిచిప్పను తీశారు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన యువకులే ఈ పైశాచికానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటన ముంబయిలో కలకలం రేపుతోంది. మహానగరంలో మహిళలకే కాదు మగాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: హోటల్‌లో దిగిన మహిళను బంధించి మేనేజర్ అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.