యాప్నగరం

సీఎంను విమర్శించాడని.. పబ్లిక్‌గా గుండుకొట్టారు..!

శివసేన కార్యకర్తలు ఓ వ్యక్తిపై దాడి చేసి, శిరోముండనం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడనే ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డారు.

Samayam Telugu 24 Dec 2019, 12:59 pm
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడనే ఆగ్రహంతో శివసేన కార్యకర్తలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దాడి చేసి, శిరోముండనం చేశారు. ముంబై నగరంలోని వడాల ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా పోలీసులు వారిపై విరుచుకుపడి లాఠీచార్జి చేయడాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఖండించారు. డిసెంబర్ 19వ తేదీన ఈ సంఘటనను జలియన్ వాలాబాగ్‌ మారణకాండతో ఆయన పోల్చారు.
Samayam Telugu tiwari


Also Read: తాళి వదిలేసి.. 70 సవర్ల బంగారంతో నవ వధువు జంప్.. ప్రియుడి తండ్రి ఆత్మహత్య

సీఎం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముంబైలోని వడాలా ప్రాంతానికి చెందిన హీరామాయి తివారీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఆయనపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు హీరామాయిపై బహిరంగంగా దాడి చేసి గుండుకొట్టారు. దీనిపై 30 మంది తనపై దాడి చేసి, బలవంతంగా శిరోముండనం చేసినట్లు హీరామాయి తివారీ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే శివసేన నాయకులతో పాటు మరికొందరు పోలీసులు.. దీనిపై రాజీ పడాలని కోరుతున్నారని తివారీ తెలిపారు. అయితే తాను రాజీపడే ప్రసక్తే లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: తిరుపతి రౌడీషీటర్ మురళి హత్యోదంతంలో సంచలన విషయాలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.