యాప్నగరం

హాస్పిటల్ బాత్రూమ్‌లో ఉరేసుకున్న కరోనా మహిళా రోగి

కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కొద్దిరోజులుగా ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం తెల్లవారుజామున బాత్‌రూమ్‌కి వెళ్లి ఉరేసుకుంది.

Samayam Telugu 15 Apr 2020, 3:36 pm
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు అందరినీ కలవరపెడుతున్నాయి. మూడు వారాలకు పైగా దేశమంతా లాక్‌డౌన్‌లో కొనసాగుతున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు కూడా తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ముంబయికి చెందిన మహిళా రోగి హాస్పిటల్ బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
Samayam Telugu suicie


Also Read: మద్యం హోం డెలివరీ పేరుతో మోసం.. రూ.93,600 కోల్పోయిన హైదరాబాదీ

ముంబయికి చెందిన మహిళ(29) కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను నగరంలోని బివైఎల్ నాయర్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లింది. ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా కిటికీకి చున్నీతో ఉరేసుకుని కనిపించింది.

Also Read: భార్య ఫోన్‌కి మిస్డ్‌ కాల్.. అనుమానంతో భర్త ఘాతుకం.. గుంటూరులో దారుణం

డాక్టర్లు ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు తేలింది. కరోనాతో బాధపడుతున్న ఆ మహిళ కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉంటోందని ఆ వార్డులో సేవలందించే సిబ్బంది చెబుతున్నారు. ఆ ఆందోళనతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: భార్య క్యారెక్టర్‌పై అనుమానం... 20 రోజుల పసిబిడ్డను నరికిచంపిన తండ్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.