యాప్నగరం

యువకుడిపై వలపు వల.. స్వీట్‌గా ఫోన్ చేయించి 30 కత్తిపోట్లు

మహిళ ఫోన్ చేయడంతో దీపక్.. స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో డ్యాన్స్ బార్‌కు వచ్చాడు. హత్య ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డైంది. నిందితుల ఆచూకీ కోెసం పోలీసులు గాలిస్తున్నారు.

Samayam Telugu 22 Jan 2020, 4:41 pm
మహిళను ఎరగా వేసి ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని ఓ డ్యాన్స్ బార్ వద్ద ఈ దారుణం జరిగింది. ఉల్హాస్‌పూర్‌ సమీపంలోని మనేర్ గ్రామానికి చెందిన దీపక్ బోయిర్‌కు నరేష్ చావన్ అనే వ్యక్తితో ఇటీవల గొడవపడ్డాడు. ఆ వివాదాన్ని మనసులో పెట్టుకున్న చావన్.. దీపక్‌ను అంతమొందించేందుకు పథకం రచించాడు.
Samayam Telugu pjimage (52)


మహిళతో దీపక్‌కు ఫోన్ చేయించి ట్రాప్ చేశాడు. డ్యాన్స్ బార్‌కు రావాలని మహిళ కోరడంతో స్నేహితుడితో కలిసి దీపక్ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో డ్యాన్స్ బార్‌కు వచ్చాడు. అరగంట సేపు బార్‌లో ఉన్న దీపక్.. అక్కడి నుంచి వెనుదిరిగాడు. బార్ నుంచి బయటకు రాగానే దీపక్, అతని స్నేహితుడిని ఐదుగురు చుట్టుముట్టారు.

Also Read: చేతబడి కోసం గూగుల్‌లో సెర్చ్.. అడ్డంగా బుక్కైన హైదరాబాద్ యువతి

ఒక తుపాకీ సహా కత్తులతో ఐదుగురు వెంబడించడంతో ఇద్దరు తలోదిక్కు పరారయ్యారు. దీపక్‌ను టార్గెట్ చేసిన దుండగులు.. విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి చంపేశారు. అత్యంత దారుణంగా 30 కత్తిపోట్లు పొడిచారు. దీపక్ శరీరం ఛిద్రమైపోయింది. మహిళ విషయంలోనే దీపక్, చావన్ మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

దీపక్ స్నేహితుడు వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కత్తిగాయాలతో పడి ఉన్న దీపక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డైంది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.

Read Also: అత్తింటి ఆస్తిపై ఆశతో.. బావమరిదిని బండరాయితో కొట్టి చంపిన బావ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.