యాప్నగరం

వేములవాడలో కలకలం.. టీఆర్ఎస్ కౌన్సిలర్ సోదరుడిపై హత్యాయత్నం

మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మూడో వార్డులో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిసిన విజయ్ సోదరుడు రాజుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు.

Samayam Telugu 26 Feb 2020, 10:27 am
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కత్తిదాడి కలకల రేపింది. రాజు అనే వ్యక్తిపై మంగళవారం రాత్రి కొందరు దుండుగులు పిడిగుద్దులు కురిపించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మున్సిపల్ ఎన్నికలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది.
Samayam Telugu pjimage (2)


Also Read: పెళ్లికి అడ్డొస్తున్నాడని ప్రియుడి దారుణ హత్య, కడపలో నర్సు కిరాతకం... అనేక మందితో అఫైర్లు

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మూడో వార్డు నుంచి విజయ్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ప్రసాద్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన మనుషులతో కలిసి విజయ్ సోదరుడు రాజుపై హత్యాయత్నం చేశారు. అతడి ఇంటికి చేరుకున్న కొందరు దుండగులు రాజును బయటకు లాగి పిడిగుద్దులు కురిపిస్తూ కత్తితో పలుమార్లు పొడిచారు.

Also Read: 11ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం.. పశ్చిమగోదావరిలో దారుణ ఘటన

తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రాజు, ప్రసాద్‌కు కొంతకాలంగా వ్యాపార విభేదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే తొలుత రాజు వర్గీయులే ప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారని, వారి నుంచి రక్షణ కోసమే అతడు కత్తితో దాడికి పాల్పడినట్లు ప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వేములవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: టిక్‌టాక్‌లో హాట్‌హాట్ వీడియోలు, యువకులతో బూతుపురాణం.. అమర సైనికుడి భార్యను ఛీకొడుతున్న గ్రామస్థులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.