యాప్నగరం

భర్తను చంపిన స్వాతిరెడ్డి మళ్లీ అరెస్ట్.. కోర్టు తీవ్ర ఆగ్రహం

ప్రియుడి మోజులో భర్తను కిరాతకంగా చంపేసిన స్వాతిరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. బెయిల్‌పై వచ్చిన ఆమె కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేశారు.

Samayam Telugu 6 Feb 2020, 9:18 am
భర్తను కిరాతకంగా చంపేసి. అతడి స్థానంలో ప్రియుడిని భర్తగా చేసుకునేందుకు స్కెచ్‌ వేసి దొరికిపోయిన స్వాతిరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భర్తను చంపిన కేసులో జైలు జీవితం గడుపుతూ బెయిల్ బయటకు వచ్చిన ఆమెను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి స్వాతిరెడ్డికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో పోలీసులు మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు.
Samayam Telugu pjimage (3)


Also Read: వేధింపులతో భార్య, పోలీసుల భయంతో భర్త ఆత్మహత్య.. ఇద్దరు కుమార్తెలను కూడా

నాగర్‌‌కర్నూల్‌ పట్టణానికి చెందిన స్వాతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్త సుధాకర్ రెడ్డిని కిరాతకంగా హత్య చేసింది. అనంతరం ప్రియుడి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలోకి తీసుకురావడానికి నాటకమాడింది. 2017 నవంబర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2018 జూలైలో బెయిల్‌పై వచ్చిన స్వాతిని కుటుంబసభ్యులెవరూ ఆదరించకపోవడంతో పోలీసులు మహబూబ్‌నగర్‌ స్టేట్‌ హోంకు తరలించారు.

Also Read: అమ్మాయిని ఎరగా వేసి... గదికి రప్పించి.. పక్కా స్కెచ్‌తోనే చేపల వ్యాపారి హత్య

అయితే కేసు విచారణలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి రవికుమార్‌ ఇటీవల నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో స్టేట్‌ హోంలో ఉన్న ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలించారు.

Also Read: యువతిపై తాత, మేనమామ అత్యాచారం... అమ్మమ్మ ఇంట్లో రెండేళ్లుగా నరకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.