యాప్నగరం

ఒకరితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతితో పెళ్లి.. పీటలమీదే వరుడి అరెస్ట్

నిందితుడు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగిందని, వారి దగ్గర రూ.12లక్షల కట్నం తీసుకుని ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులు చెప్పడంతో అవాక్యయ్యారు.

Samayam Telugu 8 Dec 2019, 2:56 pm
ఓ యువతితో నిశ్చితార్థం చేసుకుని మరో యువతితో పెళ్లికి రెడీ అయిన యువకుడిని పోలీసులు పెళ్లి పీటల మీదే అరెస్ట్ చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. ఎస్‌బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మోహన్‌కృష్ణకు నంద్యాలకు చెందిన ఓ యువతితో ఈరోజు ఉదయం పెళ్లి చేసేందుకు ఏర్పాట్లుచేశారు. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నంద్యాల వన్‌టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
Samayam Telugu pjimage


Also Read: నోట్లో గుడ్డలు కుక్కి.. స్కూల్ టీచర్‌పై నలుగురి గ్యాంగ్ రేప్

హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ పరిణామానికి వధువుతో పాటు ఆమె తల్లిదండ్రులు, బంధువులు, అతిథులంతా షాకయ్యారు. వరుడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులను అడగ్గా వారు అసలు సంగతి చెప్పారు. మోహన్ కృష్ణకు గతంలోనూ మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగిందని, వారి దగ్గర రూ.12లక్షల కట్నం తీసుకుని ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులు చెప్పడంతో అవాక్యయ్యారు.

Also Read: తిరుపతిలో దారుణం.. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి బాలికపై గ్యాంగ్ రేప్

పోలీసులు మోహన్‌కృష్ణను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పెళ్లికి ముందే పోలీసులు రావడంతో తమ కూతురి జీవితం నాశనం కాకుండా నిలిచిందని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. అతడికి కట్నకానులకు కింద రూ.17లక్షల వరకు ఇచ్చామని, వాటిని తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. అమ్మాయిల జీవితాలతో ఆటాడుకునే మోహన్‌కృష్ణ లాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: 7వ తరగతి విద్యార్థిని గర్భవతి చేసిన 60 ఏళ్ల ప్రబుద్ధుడు! ఆ వృద్ధుడు ఎవరో తెలిస్తే షాక్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.