యాప్నగరం

భర్తే కాలయముడు... భార్యను మచ్చుకత్తితో నరికి చంపి

కట్టుకున్న భార్యను నిత్యం అనుమానిస్తూ చిత్రహింసలకు గురిచేసిన భర్త 29వ తేదీన ఆమెతో గొడవపడ్డాడు. ఆవేశంలో మచ్చుకత్తితో ఆమెను నరికి చంపేశాడు.

Samayam Telugu 31 Mar 2020, 1:53 pm
కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారాడు. కత్తితో భార్యను అతికిరాతకంగా చంపేసి పోలీసులకు లొంగిపోయాడు. నెల్లూరు నగరంలోని నాగేంద్ర నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చేజర్లకు పి.మాధవి(29)కి 12 సంవత్సరాల క్రితం మర్రిపాడుకు చెందిన నాగమణి అలియాజ్‌ మణితో వివాహమైంది. వీరికి కుమార్తె సంధ్య, కుమారుడు కార్తికేయ ఉన్నారు. మణి మూడేళ్లుగా నాగేంద్రనగర్‌‌లోని విజయభేరి అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
Samayam Telugu crime


Also Read: మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నం.. హైదరాబాద్‌లో ఇద్దరి అరెస్ట్

వివాహమైన కొంతకాలం నుంచే మణి తన భార్యపై అనుమానం పెంచుకుని వేధించేవాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులపై ఆమె బుచ్చిలోని తన అక్క కృష్ణమ్మకు చెప్పగా.. ఆమె సర్దిచెప్పి మాధవిని తిరిగి కాపురానికి పంపించింది. ఈ నెల 29న అర్ధరాత్రి దంపతుల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన మణి మచ్చు కత్తితో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం నవాబుపేట పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. నవాబుపేట ఇన్‌స్పె్క్టర్ వేమారెడ్డి, ఎస్సై రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఆన్‌లైన్లో మద్యం కోసం ఫోన్ చేసిన దంపతులు.. అకౌంట్లో రూ.1.03లక్షలు ఖాళీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.