యాప్నగరం

నెల్లూరులో పదేళ్ల బాలికపై అత్యాచారం!

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఇసుకమిట్టలో పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Samayam Telugu 22 Dec 2019, 7:20 pm
మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనాత్మక ‘దిశ’ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రోజులు గడవకముందే అతివలపై రోజుకొక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులు, బాలికలపై దారుణాలు రోజుకొకటి బయటకు వస్తోంది. ముఖ్యంగా మైనర్ బాలికలే లక్ష్యంగా కామాంధులు రెచ్చిపోతున్నారు.
Samayam Telugu rape_minor


Also Read: బలవంతంగా మద్యం తాగించి.. కార్మికురాలిపై అత్యాచారం..!

తాజాగా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఇసుకమిట్టలో పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: వివాహితను లొంగదీసుకునేందుకు బిడ్డను కిడ్నాప్ చేసి.. బెదిరించి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.