యాప్నగరం

టీడీపీ నేతపై రేప్ కేసు.. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు

తన కూతురిని టీడీపీ నేత దార్ల మోహన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని ఓ మహిళ నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Samayam Telugu 17 May 2020, 8:25 am
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మైనర్ బాలికపై టీడీపీ నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విన్నమాల గ్రామానికి చెందిన దార్ల మోహన్‌ నాయుడుపేట పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu Image


Also Read: కరెంట్‌ షాక్‌తో గ్రామ వాలంటీరు మృతి... బిడ్డ పుట్టిన నెలరోజులకే విషాదం

మరో ఘటనలో బాలికను మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నాయుడుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపై తుమ్మూరుకు చెందిన సగుటూరు వెంకటేశ్‌ అనే యువకుడు కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఇటీవల బాలికను బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమె నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంకటేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు.

Also Read: అఫైర్ బయటపడిందని జంట ఆత్మహత్య.. కామారెడ్డి జిల్లాలో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.