యాప్నగరం

నెల్లూరులో ఘరానా మోసం.. రూ.86 కోట్ల వసూళ్లు.. షాకింగ్

మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.89 కోట్ల వరకూ వసూలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Samayam Telugu 7 Oct 2020, 5:26 pm
నెల్లూరులో మరో ఘరానా మోసం బయటపడింది. మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్కీమ్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల నుంచి కోట్లలో వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి సుమారు రూ.89 కోట్ల వరకూ వసూళ్లు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. నగరంలోని వేదాయపాళెం కేంద్రంగా వెల్ పే ట్రేడింగ్ కంపెనీ పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కోటి 29 లక్షల రూపాయల నగదును దర్గామిట్ట పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
money


Also Read: అండర్‌గ్రౌండ్‌లో క్రిమినల్.. అడవిలో అతని శవం.! షాకింగ్ ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.