యాప్నగరం

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి భక్తులు వస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడగా 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.

Samayam Telugu 15 Dec 2019, 8:24 pm
Samayam Telugu bus crash

దైవ దర్శనానికి వెళ్లి భక్తులు వస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడగా 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. నేపాల్‌లోని సింధుపాల్ చౌక్‌లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుపాల్ చౌక్ జిల్లాలోని కాలిన్‌చౌక్ మందిరాన్ని దర్శించుకుని ఆదివారం ఉదయం 40 మంది యాత్రికులతో ఓ బస్సు బయల్దేరింది.

Also Read: రూ. 1,300 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు సీజ్.. ఢిల్లీలో సంచలనం!

డోలాఖా ఖాదీచౌర్- జిరి రోడ్డు మార్గంలో బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు చురుగ్గా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. గాయాలపాలైన వారికి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: దళితుడు బిర్యానీ విక్రయిస్తున్నాడని దాడి.. దేశ రాజధానిలో పడగవిప్పిన కుల వివక్ష!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.