యాప్నగరం

పెళ్లయిన మరుసటి రోజే నవవధువు అదృశ్యం

బంధువులు, స్నేహితురాళ్ల ఇళ్లతో ఎంత వెతికినా వధువు జాడ కనిపించకపోలేదు. దీంతో కుటుంబసభ్యులు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 9 Dec 2019, 3:13 pm
పెళ్లయిన మరుసటి రోజే నవవధువు కనిపించకుండా పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో నీళ్లకుంట గ్రామానికి చెందిన ఓ యువతికి ఈ నెల 6వ తేదీన గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన వాసు అనే యువకుడితో వివాహమైంది. ఆ మరుసటి రోజే ఆమెకు అప్పగింతలు అయ్యాకు అత్తింటికి బయలుదేరింది.
Samayam Telugu 10woman


Also Read: లైంగిక కోరిక తీర్చలేదని వదిన గొంతు కోసిన మరిది

బంధువులందరూ మామడుగు గ్రామానికి చేరుకున్న తర్వాత చూస్తే పెళ్లికూతురు కనిపించలేదు. దీంతో అందరూ షాకయ్యారు. ఆమె బంధువులు, స్నేహితురాళ్ల ఇళ్లతో ఎంత వెతికినా ఆమె జాడ కనిపించకపోలేదు. దీంతో కుటుంబసభ్యులు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ ప్రియాంక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: అత్తింట్లో నలుగురిని చంపి.. ఎన్‌కౌంటర్ భయంతో ఉరేసుకున్న ఉన్మాది

అయితే వధువును ఎవరైనా బలవంతంగా ఎత్తుకెళ్లారా? లేక ఉద్దేశపూర్వకంగానే ఆమె కనిపించకుండా వెళ్లిపోయిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ప్రేమ వ్యవహారమేదైనా ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో పోలీసులు యువతి ఫ్రెండ్స్‌ని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.