యాప్నగరం

ఐదు నెలల క్రితం పెళ్లి.. మనస్తాపంతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతుండటాన్ని భరించలేకపోయిన రాహుల్ యాదవ్ సోమవారం మనస్తాపం చెందిన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించేలోపే అతడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Samayam Telugu 9 Mar 2020, 2:46 pm
హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేరేడ్‌మెట్ ప్రాంతానికి చెందిన రాహుల్ యాదవ్(26 ) రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఐదు నెలల క్రితం అతడికి ఓ యువతితో వివాహమైంది.
Samayam Telugu pjimage (1)


Also Read: బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం.. భార్యభర్తల అరెస్ట్, ఐదుగురు సెక్స్‌వర్కర్లకు విముక్తి

కొద్దిరోజులు ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతుండటాన్ని రాహుల్ తట్టుకోలేకపోయాడు. అటు తల్లి, మరోవైపు భార్యకు నచ్చజెప్పలేక మనస్తాపానికి గురవుతున్నాడు. సోమవారం కూడా ఇంట్లో మరోసారి గొడవ జరగడంతో ఆందోళనకు గురైన రాహుల్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.

Also Read: మహిళా దినోత్సవ రోజే వరంగల్‌లో గ్యాంగ్ రేప్... 55ఏళ్ల మహిళపై నలుగురి పైశాచికం

ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాహుల్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: పెళ్లి చేసుకోవాలని కోరిన గర్భిణి.. గొంతు నులిమి చంపేసిన మేకల వ్యాపారి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.