యాప్నగరం

పెళ్లయి నాలుగు రోజులకే వరుడి ఆత్మహత్య.. ప్రకాశం జిల్లాలో విషాదం

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తాళ్లూరు పుట్టచెరువుపాలెంకు చెందిన వేణుకు 24న పెళ్లయింది. సోమవారం అతడు తాళ్లూరు మండలంలోని గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 28 Jul 2020, 8:54 am
ఆ నవ దంపతులకు నాలుగు రోజుల క్రితమే పెళ్లయింది. వధువు ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. ఏమైందో తెలీదు గానీ వరుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో వధువుతో పాటు రెండు కుటుంబాలు, బంధువులు షాకయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో సోమవారం జరిగింది. చీమకుర్తి మండలం పుట్టచెరువుపాలేనికి చెందిన ఎస్‌.వేణు(30) ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. సరైన ఉద్యోగం రాకపోవడంతో గ్రామంలోనే పొలం పనులు చేసుకుంటూ చిట్టీలు నిర్వహిస్తున్నాడు.
Samayam Telugu Image


Also Read: గుంటూరు: మైనర్ బాలికపై కన్నేసిన మారుతండ్రి.. న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఈ క్రమంలోనే జరుగుమల్లి మండలం పమిడిపాడుకు చెందిన ఓ యువతితో అతడిక ఈ నెల 24న వివాహమైంది. సోమవారం వేణు తాళ్లూరు మండలం సూరాయపాలెంలోని సుబాబుల్‌ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపరుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వేణు సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయినా నాలుగో రోజు అతడు ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టచెరువుపాలెంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Also Read: వికారాబాద్: శ్రీకాకుళం మహిళపై గ్యాంగ్‌ రేప్.. చంపేసి దహనం చేసిన కామాంధులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.