యాప్నగరం

భర్తతో ఫోన్ మాట్లాడిన కొద్ది క్షణాలకే నవ వధువు దారుణ హత్య

శనివారం మధ్యాహ్నం భర్తతో ఫోన్లో మాట్లాడిన మోనిక కాసేపటికే హత్యకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 10 Aug 2020, 3:33 pm
కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో విషాదం నింపింది. తిరుత్తంగళ్‌-అల్‌మరాత్తుపట్టి సమీపం పెరియార్‌కాలనీకి చెందిన సెల్లపాండియన్‌ (26)కు తిరుమంగళం సత్యనగర్‌కు చెందిన ప్రగతి మోనిక (24) అనే యువతితో నెలన్నర రోజుల క్రితం వివాహమైంది. సెల్లపాండియన్‌ స్థానికంగా అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలో పనిచేస్తుండగా.. మోనిక డిగ్రీ పూర్తి చేసింది. శనివారం ఉదయం సెల్లపాండియన్‌ విధులకు వెళ్లగా.. మోనిక మధ్యాహ్న సమయంలో భర్తతో ఫోన్లో మాట్లాడింది.
Samayam Telugu Image


Also Read: పులివెందులలో మహిళ దారుణ హత్య.. తమ్ముడే హంతకుడా?

కాసేపటి తర్వాత పక్కింట్లో ఉండే మహిళ వారింటికి వెళ్లగా మోనిక రక్తపు మడుగులో కనిపించింది. దుండగులు ఆమె గొంతు కోసి హతమార్చినట్లు గమనించి దిగ్భ్రాంతి చెందిన ఆ మహిళ వెంటనే సెల్లపాండియన్‌కు సమాచారం అందించింది. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నాడు.

Also Read: తండ్రీ, కూతుళ్ల ఆత్మహత్య కేసు... అల్లుడి అక్రమ సంబంధం వల్లే

కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మోనిక మృతదేహాన్ని పోస్టు మార్గం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెను నగలు కోసం ఎవరైనా హత్య చేశారా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్డీఓ విచారణ చేపడతారని పోలీసులు వెల్లడించారు.

Also Read: హైదరాబాద్: అర్ధరాత్రి ప్రియుడి ఇంటికొచ్చిన మహిళ.. తెల్లారేసరికి శవమై

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.