యాప్నగరం

Yadadri: ఆర్య సమాజ్‌లో పెళ్లి.. ఆర్నెల్లకే యువతి ఆత్మహత్య

ప్రేమ జంట ఆర్యసమాజ్‌లో వివాహ బంధంతో ఒక్కటైంది. ఆర్నెల్లు తిరక్కుండానే అత్తింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

Samayam Telugu 9 Oct 2020, 4:17 pm
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఆర్నెళ్లకే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాదాద్రి భువనగిరిలో వెలుగుచూసింది. అత్తింటి వేధింపులు భరించలేకే బలవన్మరణానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని మోత్కూర్ మండలం దాతప్పగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన నవిత(22) గత మార్చిలో ప్రేమ వివాహం చేసుకుంది. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న జంట గ్రామంలో కాపురం పెట్టారు.
Samayam Telugu నవిత పెళ్లినాటి ఫొటో
suicide


కొద్దికాలం సాఫీగానే సాగినప్పటికీ నవితకి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు ఎక్కువవడంతో ఆమె ఈ నెల 2వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నవిత గురువారం రాత్రి మృతి చెందింది. కూతురి మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భర్తతో తాగుడు మాన్పించాలని తీసుకెళ్లి.. డాక్టర్‌తో భార్య ఎఫైర్.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.