యాప్నగరం

పుట్టింటి వాళ్లు బంగారం పెడితేనే సీమంతం.! హైదరాబాద్‌లో గర్భిణి ఆత్మహత్య

పెళ్లైన ఐదునెలలకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. తల్లి కాబోతున్నానన్న సంతోషం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచింది.

Samayam Telugu 22 Oct 2020, 3:21 pm
వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. తల్లిని కాబోతున్నానన్న ఆనందం అత్తింటి వేధింపులతో ఆవిరైంది. పెళ్లై ఐదు నెలలు తిరక్కుండానే యువతి బలవన్మరణానికి పాల్పడింది. బంగారం పెడితేనే సీమంతం చేస్తామంటూ వేధింపులు పరాకాష్టకు చేరడంతో ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. జగద్గిరిగుట్టకు ప్రాంతంలోని పీఎస్ పాపిరెడ్డినగర్‌కి చెందిన జిమ్‌ట్రైనర్‌ శ్రవణ్‌కుమార్‌కి గత జూన్‌లో కృష్ణ ప్రియ(24)తో వివాహమైంది.
Samayam Telugu కృష్ణ ప్రియ పెళ్లి నాటి ఫొటో
suspicious death


వివాహ సమయంలో ఐదు లక్షలు కట్నంగా ముట్టజెప్పారు. అయినా కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కృష్ణ ప్రియ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త, అత్తమామలు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read: బైక్ అదుపుతప్పి ఘోరం.. గుంటూరులో యువకుడి దుర్మరణం

కట్నంగా మరో రూ.12 లక్షలు తేవాలంటూ శ్రవణ్ భార్యను వేధింపులకు గురిచేశాడని ఆమె బంధువులు చెబుతున్నారు. గర్భం దాల్చిన కృష్ణ ప్రియ సీమంతం విషయంలోనూ రాద్ధాంతం చేశారని.. ఐదు కాసుల బంగారం పెడితేనే సీమంతానికి పుట్టింటికి పంపిస్తామని వేధింపులకు గురిచేశారని వాపోయారు. అదనపు కట్నం కోసం అన్యాయంగా బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: మహబూబాబాద్ దీక్షిత్ మర్డర్: ‘వాడొక్కడే చంపేశాడు’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.