యాప్నగరం

పెళ్లయిన ఐదు రోజులకే వధువు ఆత్మహత్య

మధురై జిల్లా కొట్టాయ్‌పట్టి సమీపంలోని వెళ్లాలపట్టి గ్రామానికి చెందిన ఒయ్యప్పన్ కుమార్తె రాజ్యలక్ష్మి(24)కి శివగంగై జిల్లా ఎస్‌వీ మంగళం అనే యువకుడితో ఈ నెల 10వతేదీన వివాహమైంది.

Samayam Telugu 18 Apr 2019, 10:32 am
ఎన్నో కలలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువతిఐదు రోజులకే ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో కలకలం రేపింది. మధురై జిల్లా కొట్టాయ్‌పట్టి సమీపంలోని వెళ్లాలపట్టి గ్రామానికి చెందిన ఒయ్యప్పన్ కుమార్తె రాజ్యలక్ష్మి(24)కి శివగంగై జిల్లా ఎస్‌వీ మంగళం అనే యువకుడితో ఈ నెల 10వతేదీన వివాహమైంది. పెళ్లయిన మరుసటి రోజు నుంచే దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి.
Samayam Telugu తెుడుదా


ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య మంగళవారం తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాజ్యలక్ష్మిని పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు భర్త. కొద్దిసేపటి తర్వాత రాజ్యలక్ష్మి ఇంటికి సమీపంలోని తోటలోకి వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానించిన ఆమె తల్లి అక్కడికి వెళ్లి చూడగా విషం తాగి పడిపోయి ఉంది.

దీంతో తల్లిదండ్రులు రాజ్యలక్ష్మిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. ఈ ఘటనపై మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆమె భర్త, అత్తమామలను ప్రశ్నిస్తున్నారు. వివాహమై వారం తిరక్కముందే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో విషాదం నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.