పాకిస్తాన్ పన్నిన వలపు వల (హనీ ట్రాప్)లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పాక్ విషవలయాన్ని ఛేదించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ పేరుతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్లో భాగంగా ఇప్పటికే ఏడుగురు నేవీ సిబ్బందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ.. తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.
Also Read: పాక్కు గూఢచర్యం.. ‘విశాఖ’లో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్!
విస్తుపోయే విషయాలు వెలుగులోకి..
ఎన్ఐఏ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ గూఢచారి విభాగమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ).. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని ఎరగా వేస్తుంది. తర్వాత వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీస్తుంది. అనంతరం ఐఎస్ఐ నేరుగా రంగంలోకి దిగి.. ఆ వీడియోలతో ట్రాప్లో చిక్కుకున్న వారిపై బెదిరింపులకు దిగుతుంది. ఇలా.. కీలకమైన నౌకాదళ సమాచారం సేకరిస్తోంది. దీనిపై భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో నెల రోజులపాటు ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ పేరుతో రహస్య విచారణ జరిపింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
Also Read: భారత సైనికులకు పాకిస్తాన్ అమ్మాయిల వలపు వల!
వెంటనే అప్రమత్తమైన అధికారులు గత నెల 20న ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్ (నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్ను అరెస్ట్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ బృందం రెండు రోజుల క్రితం మరోసారి విశాఖపట్నం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ఈఎన్సీ)లో 2015లో విధుల్లోకి చేరిన రాజేష్, నిరంజన్, లోక్నందాలను అరెస్ట్ చేసినట్లు నిఘా వర్గాల భోగట్టా. అంటే.. వీరి ముగ్గురితో కలిపి ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నేవీ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లయింది. ఈ వ్యవహారంలో ఇంకా మరికొందరు నేవీ సెయిలర్స్ కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఎన్ఐఏ బృందం ఆ దిశగా దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
Also Read: ‘అమిత్ షా అడగమన్నారు.. బీజేపీకి రూ. 3 కోట్ల ఫండ్ ఇవ్వండి’.. మంత్రికి ఝలక్!
Also Read: పాక్కు గూఢచర్యం.. ‘విశాఖ’లో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్!
విస్తుపోయే విషయాలు వెలుగులోకి..
ఎన్ఐఏ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ గూఢచారి విభాగమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ).. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని ఎరగా వేస్తుంది. తర్వాత వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీస్తుంది. అనంతరం ఐఎస్ఐ నేరుగా రంగంలోకి దిగి.. ఆ వీడియోలతో ట్రాప్లో చిక్కుకున్న వారిపై బెదిరింపులకు దిగుతుంది. ఇలా.. కీలకమైన నౌకాదళ సమాచారం సేకరిస్తోంది. దీనిపై భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో నెల రోజులపాటు ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ పేరుతో రహస్య విచారణ జరిపింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
Also Read: భారత సైనికులకు పాకిస్తాన్ అమ్మాయిల వలపు వల!
వెంటనే అప్రమత్తమైన అధికారులు గత నెల 20న ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్ (నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్ను అరెస్ట్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ బృందం రెండు రోజుల క్రితం మరోసారి విశాఖపట్నం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ఈఎన్సీ)లో 2015లో విధుల్లోకి చేరిన రాజేష్, నిరంజన్, లోక్నందాలను అరెస్ట్ చేసినట్లు నిఘా వర్గాల భోగట్టా. అంటే.. వీరి ముగ్గురితో కలిపి ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నేవీ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లయింది. ఈ వ్యవహారంలో ఇంకా మరికొందరు నేవీ సెయిలర్స్ కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఎన్ఐఏ బృందం ఆ దిశగా దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
Also Read: ‘అమిత్ షా అడగమన్నారు.. బీజేపీకి రూ. 3 కోట్ల ఫండ్ ఇవ్వండి’.. మంత్రికి ఝలక్!