యాప్నగరం

ఇంట్లో 14 సీసీ కెమెరాలు.. 15 కుక్కలు.. అయినా దోపిడీ ఎలా చేశారంటే.!

దండుపాళ్యం తరహాలో ఓ మహిళ డాక్టర్ ఇంటి తలుపుతట్టింది. వైద్యం కోసం వచ్చానని చెప్పడంతో ఇంట్లోకి రమ్మనడమే పాపమైంది. ఆమె వెనకే 15 మంది ఇంట్లోకి చొరబడి అరాచకం సృష్టించారు.

Samayam Telugu 26 Feb 2020, 7:34 pm
ఆ బంగ్లాలో చుట్టూ సీసీ కెమెరాలు.. ఇంటి చుట్టూ పహారా కాసేందుకు పెద్ద సంఖ్యలో కుక్కలు.. అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి వెళ్లాలంటే భయపడడం సహజమే. కానీ ఓ దోపిడీ ముఠా అంతటి సెక్యూరిటీ ఉన్న ఇంటినే టార్గెట్ చేసి మరీ లూటీ చేసిన ఘటన వెలుగుచూసింది. దండుపాళ్యం తరహాలో మహిళను ముందు పంపించి వెనకే ఇంట్లోకి చొరబడి దోచేసిన ఘటన కర్ణాటకలో జరిగింది.
Samayam Telugu robbery


వైద్యం కోసం అని చెప్పి ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకెళ్లిన ఘటన రామనగర్ జిల్లా మాగడి తాలూకా కుదూరులో జరిగింది. ఓ మహిళ రాత్రి 10 గంటల సమయంలో డాక్టర్ సుభాష్ సింగ్ ఇంటి తలుపుతట్టింది. పాపను చంకనబెట్టుకొచ్చిన మహిళ.. ఆయాసంగా ఉందని మందులు కావాలని అడిగింది. ఆమెను ఇంట్లోకి రమ్మనగానే ఆమె వెనకే ఉన్న 15 మంది ముఠా సభ్యులు అమాంతం ఇంట్లోకి చొరబడ్డారు.

Also Read:
తమలపాకు కోసం అత్త దగ్గరికి.. మెల్లిగా కోడలితో ఎఫైర్.. బెడ్రూమ్‌లో దొరికిపోవడంతో..

ఎవరని అడిగేలోపే డాక్టర్ సుభాష్ సింగ్‌, భార్య, ఇద్దరు కొడుకుల కళ్లలో కారం కొట్టేశారు. నలుగురినీ ఓ చోటకు తెచ్చి కాళ్లు, చేతులు కట్టేసి నోట్టలో గుడ్డలు కుక్కేసి ఇల్లు లూటీ చేశారు. ఇంట్లో ఉంచిన రూ.50 వేల నగదు, నగలు, ల్యాప్‌ట్యాప్, వెండి, ఖరీదైన వస్తువులు దోచుకున్నారు. పార్కింగ్‌లో ఉంచిన డిజైర్ కారులో ఉడాయించారు.

అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు ఉన్న డాక్టర్ బంగ్లాలో దోపిడీ జరగడం కలకలం రేపింది. విశాలమైన ఆ ఇంటి ప్రాంగణంలో సుమారు 14 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంటి చుట్టుపక్కల ఎలాంటి ఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటితోపాటు 15 వరకూ పెంపుడు కుక్కలున్నాయి. అయినా దొంగలు ఇంట్లో చొరబడి దోపిడీకి పాల్పడడం సంచలనం కలిగించింది.

Read Also: శాప విముక్తి కోసమట.! ఐదుగురు అక్కాచెల్లెళ్లను నగ్నంగా నిలబెట్టి..

దొంగలు వెళ్లిపోయిన తరువాత ఎలాగోలా కట్లు తెంచుకున్న డాక్టర్ కుమారులు బయటకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించే పనిలో పడ్డారు. సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించకుండా ఉండేందుకు దొంగలు సీసీటీవీ ఉపకరణాలను అపహరించుకెళ్లడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.