యాప్నగరం

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సికింద్రాబాద్‌లో విషాద ఘటన

ఆస్పత్రిలో డ్యూటీ ముగించుకుని నర్సింగ్ విద్యార్థిని సౌందర్య హాస్టల్ రూమ్‌కి వచ్చింది. రాత్రయినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది..

Samayam Telugu 12 Aug 2020, 4:13 pm
సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మాల్‌కి చెందని సౌందర్య నర్సింగ్ కళాశాలలో చదువుతూ ఆస్పత్రిలో సేవలందిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న నర్సింగ్ హాస్టల్‌లో తన రూమ్‌కి వెళ్లింది. రాత్రి అయినా ఆమె గదిలో నుంచి బయటికి రాకపోవడం.. తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది గది వద్దకు వెళ్లి చూశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


చలనం లేకుండా మంచంపై పడి ఉన్న సౌందర్యని చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గదిలో ఇంజెక్షన్ లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించుకుని ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: కన్నతండ్రి కామవాంఛలు తీర్చలేక.! తండ్రిని కూతుళ్లు చంపేసిన కేసులో షాకింగ్ నిజాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.