యాప్నగరం

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియురాలు.. యువకుడి ఆత్మహత్య

మూడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత ప్రియురాలు వేరొకరితో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 12 Jan 2020, 11:46 am
వారిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా ప్రియురాలు మరో యువకుడికి దగ్గరై తనను నిర్లక్ష్యం చేయడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. మనస్తాపంతో శనివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు రైలు పట్టాలపై కూర్చుని ప్రియురాలు మోసం చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్‌ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ విషాదకర ఘటన ఒడిశాలో జరిగింది.
Samayam Telugu images (5)


Also Read: కాబోయే భార్య కాల్‌గర్ల్ అని తెలిసి షాకైన యువకుడు.. ఆఖర్లో అదిరే ట్విస్ట్

కటక్‌ నగరంలో తాలొదండొ ఏటికాలువ ప్రాంతంలో శనివారం రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని మధుపట్నా పీఎస్ పోలీసులు గుర్తించారు. అతడిని కటక్‌ రవుసొపట్నాకు చెందిన మనోజ్‌ స్వయిగా గుర్తించారు. రైలు పట్టాల వద్ద సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలో విఫలం కావడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు.

Also Read: మసాజ్ కోసం అమ్మాయిని బుక్ చేసుకుంటే.. రూ.11లక్షలు కొట్టేశారు.

మరోవైపు ఈ ఘటనపై మనోజ్ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి కుటుంబసభ్యులే అతడిని చంపి రైలు పట్టాలపై పడేశారని ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కటక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో వ్యభిచారం.. గంటకు రూ.3వేలు తీసుకుని అమ్మాయిల సరఫరా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.