యాప్నగరం

అమ్మాయి చున్నీ లాగాడని యువకుడిపై ఎస్ఐ దాడి.. పీఎస్ ఎదుట తల్లి ఆందోళన

తన కొడుకు ఏ అమ్మాయినీ వేధించలేదని, పోలీసులు అకారణంగా తమ కొడుకును కొట్టారని యువకుడి తల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. తన కొడుకును కొట్టిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Samayam Telugu 26 May 2020, 3:48 pm
ఓ యువకుడిపై ఎస్ఐ దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత రేపింది. ఏ మాత్రం సంబంధం లేని విషయంలో ఎస్‌ఐ తన కొడుకును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తూ ఓ తల్లి సోమవారం నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టింది. తన కొడుకును అకారణంగా కొట్టి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తోంది. బాధిత తల్లి కథనం ప్రకారం.... ఈ నెల 21న వేదాయపాలెంలో స్కూటీపై వెళ్తున్న యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, చున్నీ లాగాదని ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదివారం గాంధీనగర్‌కు చెందిన పవన్‌ అనే యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు.
Samayam Telugu Image


Also Read: భర్త క్వారంటైన్‌లో ఉండగా ప్రియుడితో పరారైన భార్య

తనకు ఏ పాపం తెలీదని, తాను ఏ అమ్మాయిని వేధించలేదని పవన్ ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే ఎస్ఐ అతడిని తీవ్రంగా కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు అతడిని కుటుంబసభ్యులకు అప్పగించగా వారు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పవన్ కుటుంబసభ్యులు సోమవారం స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తన కొడుకు 21వ తేదీన నెల్లూరులో లేడని చెప్పినా వినకుండా పోలీసులు అకారణంగా కొట్టాడని పవన్ తల్లి చంద్రకళ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఆ ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

Also Read: కామారెడ్డిలో విషాదం.. అప్పుల బాధతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.