యాప్నగరం

బైక్ అదుపుతప్పి ఘోరం.. గుంటూరులో యువకుడి దుర్మరణం

బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి అమాంతం చెట్టును ఢీకొట్టింది. చెట్టు బలంగా తగలడంతో తలకు తీవ్రగాయాలై యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.

Samayam Telugu 22 Oct 2020, 2:34 pm
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పడంతో ఘోరం జరిగిపోయింది. ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు-అమరావతి రోడ్డులో లాం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. అమరావతి మండలంలోని మండాది గ్రామానికి చెందిన సింగరాయప్ప(36) బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. చెట్టు బలంగా తగలడంతో సింగరాయప్ప తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


Also Read: కాల్వలో శవమై తేలిన టీచర్.. మిస్టరీగా మరణం?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.