యాప్నగరం

కల్వర్టు గుంతలోకి దూసుకెళ్లిన కారు.. గుంటూరులో విషాదం

రాజధాని అమరావతి పరిధిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. కల్వర్టు కోసం తీసిన గుంతలో నీరు నిలిచి ఉండడంతో కారు ప్రమాదానికి..

Samayam Telugu 30 Jul 2020, 5:57 pm
వేగంగా వస్తున్న కారు కల్వర్టు గుంతలోకి దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా విజయవాడ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సీడ్‌యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తాళ్లాయపాలెం జంక్షన్ వద్ద తవ్విన కల్వర్టు గోతిలోకి కారు దూసుకెళ్లింది. కల్వర్టు గొయ్యిలో నీరు నిలిచి ఉండడంతో కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏలూరుకి చెందిన మానవ శంకర్రావు(60) ప్రాణాలు కోల్పోయారు. తన భార్య స్వగ్రామమైన ఉద్దండ్రాయునిపాలెం వచ్చి వెళ్తుండగా శంకర్రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన తీవ్రగాయాలపాలై మృత్యువాతపడ్డారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


Also Read: రిజల్ట్స్ రోజే యువతి ఆత్మహత్య.. కానీ వీధి చివరన ఆరా తీస్తే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.