యాప్నగరం

నంద్యాలలో ఘోరం.. బైక్‌ పైనుంచి పడిన యువకుడిని తొక్కేసిన లారీ

రోడ్డుపై పడిన గుంత ఓ యువకుడి ప్రాణం బలిగొంది. బైక్ కిందపడిన సమయంలోనే పక్కనే లారీ రావడంతో ఘోరం జరిగిపోయింది. లారీ తలపైకి ఎక్కడంతో యువకుడు స్పాట్‌లోనే..

Samayam Telugu 1 Aug 2020, 9:09 pm
మనిషి రోడ్డుపైకి వస్తే ఇంటికి క్షేమంగా చేరతాడో లేదోనన్న అనుమానం కలుగుతోంది. తాను సక్రమంగా వెళ్లినా ఎదురొచ్చే వాహనాలు, రోడ్డు ప్రమాదాలు.. ఎప్పుడు ఎవరిని మింగేస్తాయో తెలియని పరిస్థితి. వర్షపు నీటితో నిండిన కల్వర్టు గుంత కనిపించక కారు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయిన ఘటన ఇటీవల గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అది మరువక ముందే రోడ్డుపై గుంతల కారణంగా మరో ప్రాణం పోయింది. బైక్‌పై వెళ్తున్న యువకులు గుంతల్లో అతలాకుతలమై కిందపడిపోవడంతో పక్కనే వెళ్తున్న లారీ తొక్కేసిన అత్యంత విషాద ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది.
Samayam Telugu నంద్యాల ప్రమాద దృశ్యం
accident


నంద్యాల పట్టణంలోని టెక్కే వద్ద గుంతల కారణంగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అయితే పక్కనే వెళ్తున్న లారీ అమాంతం వారిపై నుంచి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాద ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఒళ్లుగగుర్పొడిచేలా జరిగిన ఈ ప్రమాదానికి రోడ్డుపై ఏర్పడిన గుంతలే కారణంగా తెలుస్తోంది. మృతుడిని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన శ్రీహర్షగా గుర్తించారు.

Also Read: భార్యపై స్నేహితులతో గ్యాంగ్‌ రేప్.. భర్తే దగ్గరుండి మరీ దుర్మార్గంRead Also: దొంగబాబా కామక్రీడలు.. కోరిక తీర్చకపోతే చేతబడే.. శ్రీకాళహస్తిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.