యాప్నగరం

గ్యాంగ్ రేప్ చేసి నోట్లో బియ్యం కుక్కి.. ప్రాణాలు విడిచిన ఒంగోలు బాధితురాలు

ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు ప్రాణాలు విడిచింది. దుండగులు ఆమె నోట్లో బియ్యం కుక్కడంతో అవి ఊపిరితిత్తుల్లో చేరాయని, దీంతో పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పారు.

Samayam Telugu 22 Jan 2020, 5:29 pm
ప్రకాశం జిల్లా ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ప్రాణాలు విడిచింది. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఒంగోలు శివారులో కేశవరాజు కుంట శివారులో మంగళవారం రాత్రి ఓ మహిళ వివస్త్రగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu images


Also Read: ఒంగోలులో మహిళపై గ్యాంగ్ రేప్?.. రోడ్డుపక్కన నగ్నంగా బాధితురాలు

ఆమెను ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్ష చేసి అత్యాచారానికి గురైనట్లు గుర్తించారు. బాధితురాలు అపస్మారక స్థితిలోనే ఉండటంతో పోలీసులకు వాంగ్మూలం తీసుకునే అవకాశం లభించలేదు. చివరికి పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం చనిపోయింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు అనంతరం నోట్లో బియ్యం పోసినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని బియ్యపు గింజలు ఆమె ఊపిరితిత్తుల్లోకి చేరడంతో పరిస్థితి విషమించిందని, తాము ఎంతగా ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయామని తెలిపారు.

Also Read: ఒంటరి మహిళపై రైల్లోనే గ్యాంగ్‌ రేప్.. అసలు విషయం తెలిసి ఏడుస్తున్న రేపిస్టులు

ఒంగోలు నగరంలో కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి వివరాలను సేకరిస్తున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి రేప్ చేశారా? లేక మార్గమధ్యంలో వెళ్తున్న మహిళ ఎవరినైనా అడ్డగించి అఘాయిత్యానికి పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

Also Read: అత్తింటి ఆస్తిపై ఆశతో.. బావమరిదిని బండరాయితో కొట్టి చంపిన బావ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.