యాప్నగరం

ఆమెను రేప్ చేసి చంపేశారు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు

తాజాగా వెలువడిన పోస్టుమార్టం నివేదికలో నమ్రితపై అత్యాచారం చేసి గొంతు నులిచి చంపేశారని వెల్లడి కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అక్కడ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

Samayam Telugu 8 Nov 2019, 10:35 am
పాకిస్థాన్‌‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హిందూ విద్యార్థిని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించినా పోస్టుమార్టం నివేదిక గుట్టురట్టు చేసింది. ఆమెను అత్యాచారం చేసి తర్వాత గొంతు నులిమి చంపేసినట్లు నివేదికలో పేర్కొనడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Samayam Telugu pakistan hindu medical student namrita raped killed autopsy report confirms
ఆమెను రేప్ చేసి చంపేశారు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు


Also Read: పదో తరగతి విద్యార్థినిపై వారం రోజుల పాటు రేప్

సింధ్‌ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్‌ కాలేజీ విద్యార్థిని నమ్రితా కుమారి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌ 16న తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించింది. తన చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నమ్రితా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె బాడీలో మగ డీఎన్ఏ ఉందని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో నమ్రితను అత్యాచారం చేసి హత్య ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు.

Also Read: మహిళను అసభ్యంగా ఫోటో తీసిన యువకుడు.. చితక్కొట్టిన ఆమె భర్త

ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలువడిన పోస్టుమార్టం నివేదికలో నమ్రితపై అత్యాచారం చేసి గొంతు నులిచి చంపేశారని వెల్లడి కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ అక్కడ కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రావడంతో ఆందోళనలు మరింత పెరిగే అవకాశముందని సింధ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Also Read: చిత్తూరు జిల్లాలో దారుణం.. పెళ్లిలో చిన్నారిని ఎత్తుకెళ్లి హత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.