యాప్నగరం

కారులో లిఫ్ట్ అడిగినందుకు రూ.46వేలు దోపిడీ.. హైదరాబాద్ శివారులో ఘటన

రంగారెడ్డి జిల్లా కొందుర్గులో లిఫ్ట్ అడిగి ఎక్కిన జయకిరణ్‌ యాదవ్‌ను కారులో ఉన్నవ్యక్తులు దోచుకున్నారు. ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని రెండుసార్లుగా రూ.46వేలు దోచుకున్నారు.

Samayam Telugu 10 Jul 2020, 9:59 am
Samayam Telugu Image
కారులో లిఫ్ట్ అడిగి ఎక్కిన వ్యక్తి నిలువు దోపిడీకి గురైన ఘటన హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయకిరణ్‌ యాదవ్‌ షాద్‌నగర్‌లో ఉంటూ కొందుర్గు శివారులోని ఓ టెక్స్‌టైల్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. జూన్‌ 30న రాత్రి 8 గంటలకు విధులు ముగించుకుని షాద్‌నగర్‌ వెళ్లేందుకు రోడ్డుపై నిలబడి ఉన్నాడు. కొందుర్గు వైపు నుంచి షాద్‌నగర్‌ వెళ్తున్న ఓ కారును లిఫ్ట్‌ అడిగి ఎక్కాడు. డ్రైవర్‌ శివకుమార్‌‌తో పాటు రమేశ్‌, రాజు అలియాస్‌ రూప్లా కలిసి కారులోనే జయకిరణ్‌ను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకొని పాస్‌వర్డ్‌ తెలుసుకుని షాబాద్‌ శివారులో వదిలేసి పరారయ్యారు.

Also Read: పక్క రాష్ట్రాల అమ్మాయిలతో వ్యభిచారం.. హైదరాబాద్‌లో ఐదుగురి అరెస్ట్

షాద్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద రూ.20 వేలు, నందిగామ పెట్రోల్‌ బంకు వద్ద మరో రూ.26 వేలు ఫోన్‌ పే ద్వారా చెల్లించారు. బాధితుడు వెంటనే కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.35వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ శివకుమార్‌పై గతంలోనూ ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Also Read: అన్న భార్యతో సహజీవనం.. గొంతులో పొడిచి చంపేసిన తమ్ముడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.