యాప్నగరం

పేషెంట్‌ని కొట్టిచంపేసిన ఆస్పత్రి యాజమాన్యం.. కారణం తెలిస్తే షాకే..

వైద్యానికి ఎంత ఖర్చవుతుందని చమన్ ఆస్పత్రి వర్గాలను అడిగాడు. ముందు కొంత కట్టమని చెప్పడంతో కట్టేశాడు. మళ్లీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో గొడవ జరిగింది.

Samayam Telugu 3 Jul 2020, 4:24 pm
బిల్లు కట్టడానికి డబ్బుల్లేవన్నాడని ఆస్పత్రి యాజమాన్యం పేషెంట్‌ని కొట్టిచంపేసిన అమానుష ఘటన యూపీలో చోటుచేసుకుంది. అలీగఢ్‌కి చెందిన సుల్తాన్ ఆరోగ్యం బాగోకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. అతని బంధువు చమన్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే ఆస్పత్రి బిల్లు ఎంతవుతుందని చమన్ ఆస్పత్రి వర్గాలను అడిగాడు. అందుకు వారు తొలుత రూ.5 వేలు కట్టండి.. స్కానింగ్ తర్వాత ఎంతకట్టాలో చెబుతామని సమాధానమిచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అనంతరం మరో నాలుగు వేలు కట్టమనడంతో తన వద్ద లేవని చమన్ బదులిచ్చాడు. పేషెంట్‌ని డిశ్చార్జి చేయాలని కోరాడు. అందుకు ఆస్పత్రి ప్రతినిధులు ససేమిరా అన్నారు. బిల్లు మొత్తం చెల్లిస్తేనే పేషెంట్‌ని డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది చమన్, సుల్తాన్‌పై తీవ్రంగా దాడి చేసి కొట్టారు.

Also Read: మహిళ నోట్లో బూడిద పెట్టి.. భూతవైద్యుడి కీచకపర్వం

అసలే ఆరోగ్యం బాగోని సుల్తాన్‌ని కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి సీసీటీవీ కెమెరాల్లో గొడవకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: పెళ్లి కాకుండానే కూతురికి గర్భం.. ఆరా తీస్తే దారుణం వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.