యాప్నగరం

ప్రేమన్నాడు.. సహజీవనం చేశాడు.. అబార్షన్ చేయించి పరారయ్యాడు

ప్రేమ పేరుతో యువతిని నమ్మించి రెండేళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమెకు అబార్షన్ చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Samayam Telugu 6 Apr 2020, 2:57 pm
ప్రేమ పేరుతో ఓ యువతి దారుణంగా మోసపోయిన ఘటన బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో లొంగదీసుకుని సహజీవనం చేస్తూ అబార్షన్ చేయించి పరారయ్యాడో కామాంధుడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu 1513570490-173


Also Read: కారులో గ్యాంగ్‌రేప్, గొంతు నులిమి హత్య.. చేవెళ్ల ‘దిశ’ కేసులో విస్తుపోయే అంశాలు

బీహార్ రాజధాని పాట్నాకు చెందిన సంజనకు అదే నగరానికి చెందిన రాకేష్‌తో 2018లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నా్ళ్ల పాటు ఇద్దరూ షికార్లకు తిరిగి మరింత దగ్గరయ్యారు. ఈ విషయం సంజన తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను మందలించారు. దీంతో ఆమె ప్రియుడి ఫోన్ విషయం చెప్పింది. తన దగ్గరకు వచ్చేస్తే పెళ్లి చేసుకుంటానని రాకేశ్ చెప్పడంతో ఆమె కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చేసింది. దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూ శారీరకంగా దగ్గరయ్యారు.

Also Read: ప్రియుడి మోజులో భర్త హత్య.. సినీఫక్కీలో లారీతో గుద్దించి... మదనపల్లెలో దారుణం

ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చింది. ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పి రాకేశ్‌ ఆమెకు అబార్షన్ చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంజన ఎన్నిసార్లు కోరినా మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. కొద్దిరోజులు బయట పని ఉందని చెప్పి బయటకు వెళ్లిన రాకేశ్ తిరిగి రాలేదు. అతడి సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉండటంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Also Read: ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు... తమిళనాడులో నలుగురు అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.