యాప్నగరం

ప్రాణం తీసిన మత్తు.. మద్యం అనుకుని పురుగులమందు తాగేసి

మద్యం మత్తులో ఉన్న గట్టయ్య ఓ సీసాలో ఉన్న పురుగులమందును మద్యం అనుకుని తాగేశాడు. కాసేపటికే నురగలు కక్కుకోవడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 8 Jan 2020, 11:41 am
మద్యం మత్తులో పురుగులమందు తాగేసిన వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చెందిన మిల్కుల గట్టయ్య (46) మద్యానికి బానిసయ్యాడు. డిసెంబర్ 29వ తేదీన కాస్త మద్యం తాగిన గట్టయ్యకు ఇంకా తాగాలనిపించింది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఇంట్లోని సీసాల్లో కొంచెమైనా మద్యం దొరుకుతుందేమోనని వెతుకుతున్నాడు.
Samayam Telugu images (5)


Also Read: ప్రియుడికి నగ్నంగా ఫోజులిచ్చిన బాలిక.. గుట్టుగా రికార్డ్ చేసి రూ.5లక్షలు డిమాండ్

ఆ సమయంలో పురుగు మందు పోసి ఉన్న సీసా కనిపించడంతో అది మద్యం అనుకొని తాగేశాడు. కాసేపటికే నురగలు కక్కుకోవడంతో కుటుంబసభ్యులు అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: భార్యను బెదిరించేందుకు తన ఇంట్లోనే దొంగతనం చేయించిన రౌడీషీటర్

గట్టయ్య భార్య సరోజ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోషించే వ్యక్తి చనిపోవడంతో గట్టయ్య కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. తాగుడు అలవాటు మానేయాలని ఎన్నిసార్లు కోరినా గట్టయ్య పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ అలవాటే తన భర్త ప్రాణం తీసిందని అతడి భార్య సరోజ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Also Read: కొబ్బరిమట్టలతో కొట్టి, మద్యం తాగించి వివాహితపై గ్యాంగ్ రేప్.. ఏలూరులో రౌడీషీటర్ల అకృత్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.