యాప్నగరం

నరసరావుపేట: పెట్రోల్ బంక్ మేనేజర్ పరారీ.. రూ.30 లక్షలతో జంప్

వారం రోజుల నుంచి బంకులో వచ్చిన కలెక్షన్ అంతా మూటగట్టుకుని మేనేజర్ పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Samayam Telugu 25 Mar 2020, 8:42 pm
పెట్రోల్ బంకు మేనేజర్ ఏకంగా యజమానికే శఠగోపం పెట్టిన సంఘటన వెలుగుచూసింది. కలెక్షన్ మొత్తం లెక్కచూసి బ్యాంకులో డీడీ తీస్తానంటూ వెళ్లిన మేనేజర్ తిరిగిరాలేదు. మూడు రోజులైనా ఆచూకీ తెలియకపోవడంతో ఆరా తీస్తే ఆ డబ్బుతో ఉడాయించినట్లు తెలిసి యజమాని లబోదిబోమన్న ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది.
Samayam Telugu money1


గత అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జిలానీకి వినుకొండ రోడ్డులో పెట్రోల్ బంక్ ఉంది. అందులో నరసరావుపేట పరిధిలోని ములకలూరుకి చెందిన షేక్ మౌలాల అనే వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంకులో డీడీ తీయాలంటూ వారం రోజుల నుంచి బంకులో వచ్చిన కలెక్షన్ అంతా తనవద్దే ఉంచుకున్నాడు.

Also Read: కరోనాపై యుద్ధంలో మేము సైతం.. కూరగాయలు, నిత్యవసరాలు అన్నీ ఇంటికే.. ఏపీ యువత ప్రయోగం

రెండు రోజుల కిందట బ్యాంకులో డీడీ తీస్తానంటూ మొత్తం కలెక్షన్ రూ.30 లక్షలు తీసుకుని బంకు నుంచి బయటికి వెళ్లాడు. మూడు రోజులైనా తిరిగి రాకపోవడం.. బ్యాంకులో డీడీ తీయకపోవడంతో అనుమానం వచ్చి విచారించగా మేనేజర్ మౌలాలి ఆ డబ్బుతో ఉడాయించినట్లు తెలిసి యజమాని పోలీసులను ఆశ్రయించాడు. రెండో పట్టణ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు విచారిస్తున్నారు.

Read Also: సామాజిక దూరం పాటించమన్నందుకు దారుణం.. కత్తితో పొడిచి కిరాతకంగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.