యాప్నగరం

ఇంటర్ బాలికకు ప్రేమ వల.. గర్భవతిని చేసిన పీజీ స్టూడెంట్

ప్లస్ టూ చదువుతున్న మైనర్ బాలికపై కన్నేసిన పీజీ స్టూడెంట్ మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చిన

Samayam Telugu 1 Jun 2020, 11:08 am
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను లైంగికంగా దోచుకుని గర్భవతిని చేసిన ఘటన తమిళనాడులోన అరియలూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని కాత్తాన్‌కుడికాడు గ్రామానికి చెందిన పరమశివం (21) అనే యువకుడు అరియలూరు పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో పీజీ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థినిపై కన్నేసిన అతడు మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. తరుచూ లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది.
Samayam Telugu Image


Also Read: వివాహితపై నలుగురు యువకుల గ్యాంగ్‌ రేప్.. వీడియో తీసి బెదిరింపులు

బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు వైద్య పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో వారు అబార్షన్ చేయాలని డాక్టర్లను కోరారు. అందుకు నిరాకరించిన డాక్టర్లు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అరియలూరు మహిళా పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి బాలిక తల్లిదండ్రులను విచారించారు. వారు ఇచ్చిన వాంగ్మూలంతో నిందితుడు పరమశివంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read: స్నేహితుడి భార్యపైనే కామం.. గదిలో బంధించి రేప్.. ఏలూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.