యాప్నగరం

ఇంటికెళ్లొచ్చి ఉరేసుకుంది.. పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య.. తిరుపతిలో విషాదం

లాక్‌డౌన్‌తో ఇంటికెళ్లిన పీహెచ్‌డీ విద్యార్థిని శ్యామల నాలుగు రోజుల క్రితమే వర్సిటీ హాస్టల్‌కొచ్చింది. సడెన్‌గా ఉరికి వేలాడుతూ కనిపించింది.

Samayam Telugu 28 Jun 2020, 1:17 pm
తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికెళ్లి తిరిగొచ్చిన నాలుగు రోజులకే సూసైడ్ చేసుకోవడం వర్సిటీలో కలకలం రేపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tirupati suicide

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాయలం కళాశాలలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థిని పులివెందుల శ్యామల(27) ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన శ్యామల ఆమె యూనివర్సిటీ అనుబంధ హాస్టల్‌లో ఉంటూ జెనెటిక్స్ అండ్ ప్లాంటేషన్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌తో ఇంటికెళ్లిన విద్యార్థులు నాలుగు రోజుల క్రితమే తిరిగి హాస్టల్‌కి వచ్చారు. ఈలోగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సహచరులను షాక్‌కి గురిచేసింది. ఉరికి వేలాడుతున్న శ్యామలను కిందికి దించి రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

Also Read: తోడేళ్లలా యువతిని వెంటాడిన కీచకులు.. గుంటూరు రేప్ కేసులో దిగ్భ్రాంతికర నిజాలు

ఇంటికెళ్లొచ్చిన శ్యామల ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్య ఘటనతో వర్సిటీలో విషాదచాయలు అలముకున్నాయి. వర్సిటీ అధికారులు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి హాస్టల్ ఖాళీ చేయించారు. విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. శ్యామల ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Read Also: నేను చనిపోతున్నా.. కాబోయే భార్యకి యువకుడి షాక్.. ప్రకాశం జిల్లాలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.