యాప్నగరం

ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి మృతి.. ఆత్మహత్యే అంటున్న పోలీసులు

ఓయూలో యమునా హాస్టల్‌లో పీహెచ్‌డీ విద్యార్థి నరసయ్య మృతి కలకలం రేపింది. ఆర్థిక సమస్యల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

Samayam Telugu 17 Feb 2020, 7:06 pm
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం కలకలం రేగింది. పీహెచ్‌డీ చేస్తున్న ఓ యువకుడు హాస్టల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జాగ్రఫీ పీహెచ్‌డీ స్కాలర్ నరసయ్య సోమవారం మధ్యాహ్నం యుమునా హాస్టల్‌ రూమ్‌ నం.3లో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారమిచ్చారు.
Samayam Telugu dead body


Also Read: హైదరాబాద్‌లో కారు బీభత్సం.. రోడ్డు దాటుతున్న యువతిని ఈడ్చుకుంటూ

కాసేపటికే హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు నరసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రతాప్‌రెడ్డిని విచారించి వివరాలు తెలుసుకున్నారు. నరసయ్య ఆత్మహత్య చేసుకున్న ప్రాథమికంగా నిర్ధారించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం కారణంగానే అతు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Also Read: ప్రియుడితో రాసలీలలు.. మందలించాడని భర్త గొంతు కోసి చంపేసిన మహిళ

నరసయ్య మృతితో యూనివర్శిటీలో ఒక్కసారిగా అలజడి రేగింది. అతడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ విద్యార్థులు యమునా హాస్టల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రిజిస్ట్రార్ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి ఉండటంతో పోలీసులు కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఫోన్లో ఆ వీడియోలు చూపిస్తూ.. 11 మంది గిరిజన బాలికలపై వార్డెన్ అఘాయిత్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.