యాప్నగరం

అక్రమ సంబంధంపై వెరైటీ తీర్పు.. పోలీసుల ఎంట్రీతో బుక్కైన గ్రామ పెద్దలు

అక్రమ సంబంధం విషయంలో ఇచ్చిన తీర్పు గ్రామ పెద్దలను చిక్కుల్లో పడేసింది. ఇకపై ప్రియురాలితో కలిసుండాలని పెద్దలు ఓ వ్యక్తిని ఆదేశించడంతో అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది.

Samayam Telugu 30 Jun 2020, 7:47 am
అక్రమ సంబంధం వ్యవహారంలో వెరైటీగా తీర్పు చెప్పిన 10 మంది పంచాయతీ పెద్దలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. రేగొండ మండలంలోని రేపాక గ్రామానికి చెందిన హరిబాబుకు జ్యోతి అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప(3) ఉంది. హరిబాబు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. హరిబాబు ఆస్తిపై కన్నేసిన ఆ మహిళ ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై పంచాయతీ పెట్టిన పెద్దలు ఎకరం భూమి రాసివ్వడంతో పాటు ఆమెతోనే కలిసి ఉండాలంటూ హరిబాబును ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.
Samayam Telugu Image


Also Read: రూ.5లక్షల నగదు సహా ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. సిద్దిపేటలో కలకలం

అయితే తన భర్త ప్రియురాలితో ఉంటే తన పరిస్థితేంటని నిలదీసిన జ్యోతి పెద్దల తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ రేగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు గ్రామ సర్పంచ్‌ పొనగంటి తిరుపతి, ఉప సర్పంచ్‌ గుడ్డ తిరుపతి, గ్రామ పెద్దలు పొనగంటి సమ్మయ్య, సుదమల్ల భిక్షపతి, గుర్రం సమ్మయ్య, తుంగండ సమ్మయ్య, పొనంగంటి ఓంకార్‌, పొనంగంటి జాని, పైడిపల్లి సాంబయ్య, గుర్రం బాబు, పొనంగంటి మల్లయ్యపై కేసు నమోదు చేశారు. గ్రామంలో ఇలాంటి తీర్పులు ఇస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: మద్యం మత్తులో భార్య హత్య.. చూసిందని కూతురి గొంతు నులిమేశాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.