యాప్నగరం

కీచక పోలీస్.. అర్ధరాత్రి ఒంటరి మహిళపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తున్న మహిళను కానిస్టేబుల్ దశరథ్ మార్గమధ్యలో అడ్డగించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేసేందుకు యత్నించాడు.

Samayam Telugu 3 Jun 2020, 11:19 am
ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతాయుత పోలీసు ఉద్యోగం ఉన్న వ్యక్తి కీచకుడిగా మారాడు. అర్ధరాత్రి సాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న వివాహితను మార్గమధ్యలో అడ్డగించి అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సంచలనం రేపింది. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఆదివారం రాత్రి భర్తతో గొడవపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్థానిక పీఎస్‌కు కాలినడకన బయలుదేరింది. మార్గమధ్యంలో స్నేహితుడితో కలిసి ఆటోలో వెళ్తున్న ఓఎస్‌ఏపీ కానిస్టేబుల్‌ దశరథ్‌ నాయక్‌ ఆమెను ఆపి విషయం తెలుసుకున్నాడు.
Samayam Telugu Image


Also Read: ఉద్యోగం పేరుతో పైశాచికం... యువతిని నిర్బంధించి 2 నెలలుగా గ్యాంగ్ రేప్

తాను సాయం చేస్తానని నమ్మించిన దశరథ్ ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లకుండా ఆటోలోనే అనేక ప్రాంతాలు తిప్పుడూ చివరికి సహిద్‌నగర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కానిస్టేబుల్ తన ఫ్రెండ్‌తో కలిసి వివాహితపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కానిస్టేబుల్, అతడి ఫ్రెండ్, ఆటోడ్రైవర్‌ను పట్టుకుని పోలీసులను అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీసీ అనూప్‌కుమార్ సాహు ఈ ఘటనపై ఆరా తీశారు.

Also Read: స్నానం చేస్తుండగా వీడియో తీసి బాలికపై రేప్.. గర్భం దాల్చిన బాధితురాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.