యాప్నగరం

ఎక్కడికెళ్తున్నావ్ రాణి.. లేడీ జర్నలిస్టుతో పోలీసులు అసభ్యకరంగా..

రాత్రివేళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళా జర్నలిస్టుపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 25 Mar 2020, 1:59 pm
కంచే చేను మేసిన సంఘటన చోటుచేసుకుంది. మహిళలు వేధింపులకు గురైతే రక్షించాల్సిన పోలీసులే లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదీ ఓ మహిళా జర్నలిస్టుని కావడం గమనార్హం. ట్విటర్ ద్వారా ఆమె విషయాన్ని వెల్లడించడంతో స్పందించిన పోలీసులు.. తక్షణ చర్యలు చేపట్టారు. ఆమెను సంప్రదించి వివరాలు సేకరించడంతో పాటు ఆమె ఇంటికెళ్లి మరీ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Samayam Telugu sexual harrass


రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళా జర్నలిస్టుతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ముంబై సమీపంలోని కండివ్లి పరిధి ఠాకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తన తండ్రికి మందులు ఇచ్చి రాత్రి వేళ తిరిగి వస్తున్న ఓ లేడీ మీడియా ప్రతినిధిని పెట్రోలింగ్ సిబ్బంది నిలువరించారు. ఆమెను తనిఖీలు చేస్తారని ఆమె భావించినప్పటికీ.. అవేవీ చేయకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు పోలీసు సిబ్బంది.

Also Read: సామాజిక దూరం పాటించమన్నందుకు దారుణం.. కత్తితో పొడిచి కిరాతకంగా..

ఎక్కడికెళ్తున్నావ్ రాణి.. అంటూ ద్వంద్వార్థాలు వచ్చేలా అనుచితంగా వ్యవహరించారు. ఇంటికి చేరుకున్న లేడీ జర్నలిస్ట్.. సమతా నగర్ పోలీస్ స్టేషన్‌కి చెందిన పెట్రోలింగ్ సిబ్బంది లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేయడతో ముంబై పోలీసులు తక్షణం స్పందించారు. సమతా నగర్ సీనియర్ ఇన్‌స్పెక్టర్‌తో సహా, మహిళా పోలీస్ అధికారి ఆమె ఇంటికెళ్లి మరీ బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

Read Also: కూతురి లవ్‌మ్యారేజ్.. ప్రియుడిని కత్తితో పొడిచేసిన తండ్రి.. నెల్లూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.