యాప్నగరం

ఉసురు తీసిన అప్పులు.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య, పెళ్లిరోజే దారుణం

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో విషాదం నింపింది.

Samayam Telugu 7 Jan 2021, 10:40 am
ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని నాశనం చేశాయి. అప్పుల బాధ తట్టుకోలేకపోయిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి అనంతరం ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లా హొసపేటె తాలూకా గాదిగనూరులో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గాదిగనూరులో నివాసం ఉండే నంజుండేశ్వర(32) సమీపంలోని జిందాల్‌ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నాడు.
Samayam Telugu Image


Also Read: ప్రేమపెళ్లికి ఒప్పుకోని పేరెంట్స్.. మరొకరితో ప్రియుడు.. యువతి ఆత్మహత్య

వచ్చే జీతం కుటుంబ పోషణకు చాలకపోవడంతో దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంక కనిపించక, రుణదాతలు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యనుకున్నాడు. మంగళవారం రాత్రి తన ఇద్దరు బిడ్డలు గౌతమి (3), స్వరూప్‌ (2)కు పురుగులమందు తాగించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక భార్య పార్వతి(27)తో కలిసి ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బుధవారం ఉదయం వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాదిగనూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బుధవారం నంజుండ- పార్వతి ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. ఈలోగానే వారు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త తెలిసి బంధువులు, సన్నిహితులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.